పార్లమెంట్ సభ్యుల అనర్హతలు మరియు ద్వంద్వ సభ్యత్వ నియమాలు: ఒక విశ్లేషణ
భారత ప్రజాస్వామ్య సౌధానికి పార్లమెంటరీ వ్యవస్థ ఒక మూలస్తంభం. ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలో శాసనసభ్యులు ప్రజల గొంతుకగా నిలుస్తున్నారు. అయితే, శాసనసభల స్థిరత్వాన్ని, పవిత్రతను కాపాడటానికి మరియు ఒకే వ్యక్తి బహుళ పదవులను చేపట్టడం ద్వారా వచ్చే ప్రయోజనాలను నిరోధించడానికి మన రాజ్యాంగ నిర్మాతలు కొన్ని కఠినమైన నిబంధనలను రూపొందించారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 101, 102, 190, 191 మరియు ప్రజా ప్రాతినిధ్య చట్టం, 1951 (RPA) లు ఈ పరిమితులను నిర్దేశిస్తూ, ప్రజాస్వామ్య జవాబుదారీతనాన్ని పెంపొందిస్తున్నాయి. వీటి గురించి కొంత వివరంగా తెలుసుకుందాం.
1. సమకాలీన రాజకీయాంశాల అనుసంధానం:
భారత దేశంలో 'ద్వంద్వ సభ్యత్వం' అనేది తరచుగా చర్చకు వచ్చే ఒక రాజ్యాంగపరమైన అంశం.
ఇటీవలి కాలంలో తెలంగాణ రాజకీయాల్లో ఇలాంటివి జరిగాయి. ఉదాహరణకు ఎ. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గార్లు లోక్సభ సభ్యులు గా (ఎంపీలు) ఉంటూనే, రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో పోటీ చేసి శాసనసభ్యులుగా (ఎమ్మెల్యేలు) విజయం సాధించారు. అయితే నిబంధనల ప్రకారం, వారు శాసనసభలో మంత్రులు/ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తమ ఎంపీ పదవులకు రాజీనామా సమర్పించారు.
ఎంపీ (MP) పదవిలో ఉండగానే ఎమ్మెల్యే (MLA)గా పోటీ చేసి గెలిచినప్పుడు, తన పాత ఎంపీ పదవికి రాజీనామా చేయవలసి రావడాన్ని రాజ్యాంగంలో ఆర్టికల్ 101(2) సూచిస్తుంది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 101(2) ప్రకారం, ఒకే వ్యక్తి ఒకే సమయంలో పార్లమెంట్ సభ్యుడిగా (MP) మరియు రాష్ట్ర శాసనసభ సభ్యుడిగా (MLA) కొనసాగడానికి వీల్లేదు. ఒకవేళ ఒక వ్యక్తి రెండు పదవులకూ ఎన్నికైతే, రాష్ట్రపతి చేసిన నియమాల ప్రకారం నిర్ణీత గడువులోగా ఒక పదవి ఖాళీ చేయాలి.
'ప్రొహిబిషన్ ఆఫ్ సైమల్టేనియస్ మెంబర్షిప్ రూల్స్, 1950' (నిర్ణీత గడువు):
ఆర్టికల్ 101(2) ఆధారంగా 1950లో ఒక ప్రత్యేక నిబంధనను రూపొందించారు. దీని ప్రకారం ఒక ఎంపీ ఎమ్మెల్యేగా గెలిచిన, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం గెజెట్ నోటిఫికేషన్ వచ్చిన తేదీ నుండి 14 రోజుల్లో తన ఎంపీ పదవికి రాజీనామా చేయాలి.
ఒకవేళ ఆ 14 రోజుల్లో తన ఎంపీ పదవికి రాజీనామా చేయకపోతే, అతని ఎంపీ (పార్లమెంట్) సీటు స్వయంచాలకంగా (ఆటోమెటిక్) ఖాళీ అయిపోతుంది. కేవలం ఎమ్మెల్యే పదవి మాత్రమే మిగులుతుంది.
రాష్ట్రాల పరంగా చుస్తే ఆర్టికల్ 190(2):
ఇదే నియమం రివర్స్లో జరిగితే అంటే ఒక ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి పార్లమెంట్ స్థానానికి గెలిస్తే దానికి ఆర్టికల్ 190(2) వర్తిస్తుంది. ప్రజా ప్రాతినిధ్య చట్టం, 1951 (RPA) సెక్షన్ 68 మరియు 69 ప్రకారం, అతను కూడా 14 రోజుల్లో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి. లేకపోతే అతని ఎమ్మెల్యే సీటు ఖాళీ అవుతుంది.
గతంలో కల్వకుంట్ల చంద్రశేఖర రావు (కేసీఆర్) గారు కూడా ఒకే సమయంలో మెదక్ లోక్సభ స్థానానికి, గజ్వేల్ శాసనసభ స్థానానికి ఎన్నికైనప్పుడు లోకసభ సీట్ వదులుకున్నారు.
ఒక వ్యక్తి ఒకే సమయంలో ఎంపీ (MP) మరియు ఎమ్మెల్యే (MLA) గా పోటీ చేసి కూడా గెలిచినప్పుడు, అతని ఎంపీ పదవి ఖాళీ అయిపోవడాన్ని రాజ్యాంగంలోని ఆర్టికల్ 101(2) సూచిస్తుంది.
రాజ్యాంగ నిబంధన ఆర్టికల్ 101(2) ప్రకారం ఒకే వ్యక్తి ఒకే సమయంలో పార్లమెంట్ (MP) సభ్యుడిగా మరియు రాష్ట్ర శాసనసభ (MLA) సభ్యుడిగా ఉండడానికి వీల్లేదు. ఒకవేళ ఒకే వ్యక్తి రెండు స్థానాల్లోనూ గెలిస్తే, నిర్ణీత గడువు ముగిసేసరికి అతను ఏదో ఒక పదవికి రాజీనామా చేయాలి. లేదంటే అతని పార్లమెంట్ (MP) సీటు ఖాళీ అవుతుంది.
రాజీనామా గడువు నియమం (14 రోజులలో):
రాజ్యాంగంలోని ఆర్టికల్ 101(2) ప్రకారం "ప్రొహిబిషన్ ఆఫ్ సైమల్టేనియస్ ఎంపీ మెంబర్షిప్ రూల్స్, 1950" నియమాల ప్రకారం రెండు స్థానాల్లో (MP & MLA) విజయం సాధించిన వ్యక్తి, ఎన్నికల అధికారిక గెజిట్ నోటిఫికేషన్ వచ్చిన తేదీ నుండి 14 రోజుల్లో ఏదో ఒక పదవికి రాజీనామా చేయకపోతే mp పదవికి రాజీనామా చేయాలి.
2. ఆర్టికల్ 101&190 - పార్లమెంట్/అసెంబ్లీ స్థానాల ఖాళీ – రాజ్యాంగ నిబంధనలు (సీట్లు ఖాళీ చేయడం):
ఆర్టికల్ 101 & 190 ప్రకారం, ఒక ఎంపీ/mla స్థానం కింది స్థానాల్లో ఖాళీ అవుతుంది:
Mp/mla మరణం తరువాత ఉప-ఎన్నికలకు మినహాయింపు (సెక్షన్ 151A, RPA 1951):
సాధారణంగా ఒక ఎంపీ మరణిస్తే ఆ స్థానానికి 6 నెలల లోపు ఉప ఎన్నిక నిర్వహించాలి. అయితే, ఇక్కడ ఒక వ్యూహాత్మక మినహాయింపు ఉంది — వారి సభ యొక్క పదవీకాలం ముగియడానికి 6 నెలల తక్కువ సమయం మాత్రమే ఉంటే, కేంద్ర ఎన్నికల సంఘం అక్కడ ఉప-ఎన్నికలను నిర్వహించదు. ఎందుకంటే తక్కువ కాలపరిమితి ఉన్న స్థానంలో ఎన్నికలు నిర్వహించడం వల్ల ప్రజాధనం మరియు సమయం వృథా అవుతాయి.
ఒక ఎంపీ/ఎమ్మెల్యే మరణించినప్పుడు, సాధారణ ఎన్నికలు 6 నెలల లోపు ఉంటే మధ్యంతర ఎన్నికలను (ఉప ఎన్నికలను) ఆపివేయడం ఖచ్చితంగా వర్తిస్తుంది. కానీ ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 101& 190 ప్రకారం జరగదు, ప్రజా ప్రాతినిధ్య చట్టం, 1951 లోని సెక్షన్ 151A ప్రకారం జరుగుతుంది.
రాష్ట్రాలలో ఎమ్మెల్యేలకు ఏ నియమం వర్తిస్తుందో, రాష్ట్ర ఎంపీలకు కూడా అదే నియమం వర్తిస్తుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 101(3) & 190(3) ప్రకారం ఒక ఎంపీ/mla మరణిస్తే లేదా రాజీనామా చేస్తే పార్లమెంటు/అసెంబ్లీ స్థానం "ఖాళీ అయినట్లు" అప్పుడు లోక్సభ లేదా రాజ్యసభ సెక్రటేరియట్/శాసనసభ లేదా శాసనమండలి నోటిఫికేషన్ విడుదల అవుతుంది.
ఆర్టికల్ 101/190 కేవలం స్థానం ఎలా ఖాళీ అవుతుందో మాత్రమే చెప్తుంది, అక్కడ ఎన్నికలు ఎప్పుడు పెట్టాలో చెప్పదు. ప్రజా ప్రాతినిధ్య చట్టం, 1951 - సెక్షన్ 151A (ఎన్నికల నిలిపివేత) MP/mla సీటు ఖాళీ అయిన తర్వాత అక్కడ ఎన్నికలు నిర్వహించాలా లేదా ఆపాలో నిర్ణయిస్తుంది.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం దేశంలో లోక్సభ, రాజ్యసభ, శాసనసభ మరియు శాసనమండలి ఎన్నికల నిర్వహణ, లేదా వాయిదా వేసే పూర్తి సర్వాధికారాలు భారత ఎన్నికల సంఘానికి (భారత ఎన్నికల సంఘం) ఉన్నాయి.
స్వచ్ఛంద రాజీనామా:
సభ్యుడు తన రాజీనామా పత్రాన్ని సభ ప్రిసైడింగ్ అధికారికి (లోక్సభ/అసెంబ్లీ స్పీకర్ లేదా రాజ్యసభ/శాసనమండలి ఛైర్మన్) సమర్పించాలి. అయితే, స్పీకర్/ఛైర్మన్ ఆ రాజీనామాను బ్లైండ్గా ఆమోదించాల్సిన అవసరం లేదు. ఆ వ్యక్తి రాజీనామా స్వచ్ఛందంగా, ఎటువంటి ఒత్తిడి లేకుండా నిర్ధారించుకున్న తర్వాత ఆమోదిస్తారు (33వ సవరణ, 1974 ద్వారా దీనిని చేర్చారు).
60 రోజుల గైర్హాజరు (సిట్టింగ్స్ నుండి గైర్హాజరు):
సభ యొక్క ముందస్తు అనుమతి లేకుండా వరుసగా 60 రోజుల పాటు సభా సమావేశాలకు హాజరుకాకపోతే, సభ వారి కోసం ఖాళీగా ఉండదని ప్రకటించవచ్చు. (గమనిక: సభ వరుసగా 4 రోజుల కంటే ఎక్కువ కాలం ప్రోరోగ్ లేదా వాయిదా పడిన కాలం ఈ 60 రోజుల్లో లెక్కించబడదు).
3. ఆర్టికల్ 102 & 191: ఎంపీ/mla mlc ల అనర్హతలు – ఒక విశ్లేషణ:
ఎ) ఆర్టికల్ 102(1) & 191(1) – సాధారణ అనర్హతలు:
ఎ. లాభదాయక పదవి (ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్) - [102(1)(a) & 191(1)(a)]:
బి. మానసిక స్థితి (అన్సౌండ్ మైండ్) - [102(1)(బి) & 191(1)(బి)]:
సి. దివాలా తీయడం [102(1)(c) & 191(1)(c)]:
D. విదేశీ పౌరసత్వం [102(1)(d) & 191(1)(d)]:
E. పార్లమెంటు చట్టాల ప్రకారం అనర్హత - [102(1)(e) & 191(1)(e)]:
ఎన్నికల ఖర్చుల వివరాలను సమర్పించక పోవడం. (ఆర్టికల్ 103 & 192):
బి) పార్టీ ఫిరాయింపులు (పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం):
భారత ఆర్టికల్ 102(2) మరియు ఆర్టికల్ 191(2) లు ఎంపీలు మరియు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులకు (ఫిరాయింపుల నిరోధక) బాధితులు భారత రాజ్యాంగం వారిపై వేసే అనర్హత వేటు గురించి వివరిస్తుంది.
పార్లమెంట్ సభ్యులకు (MP) ఆర్టికల్ 102(2) అలానే రాష్ట్రాల్లో అయితే mla /mlc లకు ఆర్టికల్ 191(2) ఈ రెండు నిబంధనలను 52వ రాజ్యాంగ సవరణ చట్టం, 1985 ద్వారా రాజ్యాంగంలో చేర్చారు. ఈ ఆర్టికల్స్ ప్రకారం అనర్హత వేటు వేయడానికి సంబంధించిన పూర్తి వివరాలను రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్లో పొందుపరిచారు.
ఒక సభ్యుడు (MP/MLA) ఏయే సమయంలో పార్టీ ఫిరాయింపుల కింద పదవి కోల్పోయాడో వివరించడం జరిగింది.
1. రాజకీయ పార్టీ సభ్యులకు వర్తించే నియమాలు:
స్వచ్ఛందంగా రాజీనామా చేయడం:
ఒక పార్టీ తరపున గెలిచిన వాళ్ళు ఆ తర్వాత స్వచ్ఛందంగా తన రాజకీయ పార్టీ సభ్యత్వాన్ని కాదనుకుంటే ఆ పార్టీ సభ్యత్వం పొందే అర్హత ఉండదు.
విప్ ను ఉల్లంఘించడం:
సభలో ఏదైనా లేదా ఓటింగ్ సమయంలో తన సొంత పార్టీ నియమాలకు (విప్) వ్యతిరేకంగా ఓటు వేసినా, లేదా ఓటింగ్కు హాజరు కాకపోయినా సభ్యత్వాన్ని కోల్పోతాడు. అయితే, సదరు సభ్యుడిని పార్టీ 15 రోజుల్లోగా క్షమిస్తే అనర్హత నుండి తప్పించుకోవచ్చు.
2. స్వతంత్ర సభ్యులకు వర్తించే నియమం (స్వతంత్ర సభ్యులు):
ఎన్నికలలో ఏ పార్టీ మద్దతు లేకుండా స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన ఎంపీ లేదా ఎమ్మెల్యే, గెలిచిన తర్వాత ఏదైనా రాజకీయ పార్టీలో చేరితే అతను వెంటనే తన పదవిని కోల్పోయే అవకాశాలు ఉన్నాయి.
3. నామినేటెడ్ సభ్యులకు వర్తించే నియమం (నామినేటెడ్ సభ్యులు):
సభకు నామినేటెడ్ సభ్యుడు (ఉదాహరణకు రాజ్యసభ లేదా కౌన్సిల్ గవర్నర్ కోటాలో వచ్చే సభ్యులు), తాను సభలో సభ్యుడిగా బాధ్యతలు స్వీకరించిన తేదీ నుండి 6 నెలల కాలం ముగిసిన తర్వాత ఏదైనా రాజకీయ పార్టీలో చేరితే అతనిపై అనర్హత వేటు పడుతుంది. (6 మాసాల లోపు చేరితే ఎలాంటి అనర్హత ఉండదు).
మినహాయింపులు (విలీనం): 2/3 వంతు మెజారిటీ:
ఒక రాజకీయ పార్టీకి మూడింట 2 వంతుల (2/3వ) మంది ఎంపీలు లేదా ఎమ్మెల్యేలు ఒకేసారి విడిపోయి, వేరే పార్టీలో విలీనమైతే (చేరితే ) లేదా రెండు గ్రూపులుగా ఏర్పడితే వారిపై పార్టీ ఫింపుల చట్టం కింద అనర్హత వేటు ఉండదు.
అనర్హతలపై తుది నిర్ణయం ఎవరిది?
ఆర్టికల్ 102(1) & 191(1) లలో వచ్చే సాధారణ అనర్హతలపై రాష్ట్రపతి లేదా గవర్నర్ నిర్ణయం తీసుకుంటారు. కానీ ఈ ఆర్టికల్ 102(2) & 191(2) (పార్టీ ఫిరాయింపుల) విషయంలో నిర్ణయాధికారం పూర్తిగా వేరుగా ఉంటుంది.
సభ స్పీకర్ లేదా చైర్మన్:
ఒక సభ్యుడు పార్టీ ఫిరాయించాడా లేదా అనే వివాదం వస్తే, ఆ సభ ప్రిసైడింగ్ అధికారి అంటే లోక్సభ/అసెంబ్లీ స్పీకర్ లేదా రాజ్యసభ/మండలి చైర్మన్ నిర్ణయం తీసుకుంటారు.
4. ద్వంద్వ నిరోధక నియమాలు (రెండు సభ్యత్వానికి వ్యతిరేకంగా నియమాలు):
ప్రజా ప్రాతినిధ్య చట్టం, 1951 లోని సెక్షన్లు 67-69 మరియు రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి ఒకే సమయంలో రెండు స్థానాల్లో ప్రజాప్రతినిధిగా ఉండటాన్ని చట్టం నిరాకరిస్తుంది. దీనికి 4 నిర్దిష్ట నియమాలు ఉన్నాయి:
ఉభయ సభలకు ఒకేసారి ఎన్నికైతే (లోక్సభ & రాజ్యసభ) ఏ సభలో ఉండాలో అని 10 రోజుల్లో తెలపాలి. తెలపకపోతే, ఆటోమెటిక్ గా రాజ్యసభ సభ్యత్వం వస్తుంది.
ఒక సభలో సభ్యుడిగా ఉంటూ, రెండో సభకు ఎన్నికైతే తక్షణమే రెండో సభలో అడుగుపెట్టిన వెంటనే, ఆయనకు ఉన్న మొదటి సభ స్థానం ఖాళీ అవుతుంది.
సభలోని రెండు స్థానాల నుండి ఒకే ఎన్నిక (ఉదా: వారణాసి & వడోదర నుండి నరేంద్ర మోదీ)14 రోజుల్లో ఏదో ఒక నియోజకవర్గం ఎంచుకోవాలి. ఎంచుకోకపోతే, ఆయన గెలిచిన రెండు స్థానాలూ ఖాళీ అయిపోతాయి.
ఒకే సమయంలో ఎంపీగా మరియు ఎమ్మెల్యే (ఎమ్మెల్యే)గా ఎన్నికైతే 'ద్వంద్వ' సభ్యత్వ నిరోధక నియమాలు 19 ప్రకారం 14 రోజుల్లో ఎమ్మెల్యే /ఎంపీకి రాజీనామా చేయాలి. చేయకపోతే, ఎంపీ పదవి రద్దవుతుంది.
5. ప్రత్యేక రాజ్యాంగపరమైన సందర్భాలు:
న్యాయస్థానం ఎన్నికను కొట్టివేస్తే (న్యాయ రద్దు):
ఒక ప్రజాప్రతినిధి ఎన్నికల ప్రక్రియలో అవినీతి లేదా అక్రమాలకు పాల్పడినట్లు ఉన్నత న్యాయస్థానం (హైకోర్టు/సుప్రీం కోర్ట్) తీర్పునిస్తే వారి సభ్యత్వం తక్షణమే రద్దు అవుతుంది.
1975 నాటి చరిత్రాత్మక 'ఇందిరా గాంధీ వర్సెస్ రాజ్ నారాయణ్' కేసులో అలహాబాద్ హైకోర్టు తీర్పును ఇక్కడ ఉదాహరణగా చెప్పవచ్చు.
అత్యున్నత పదవులకు ఎన్నికైనప్పుడు:
ఒక ఎంపీ రాష్ట్రపతిగా లేదా ఉపరాష్ట్రపతిగా ఎన్నికైతే, ఆయా పదవులను స్వీకరించిన రోజు వారి పూర్వపు పార్లమెంట్ సమావేశం ముగిసిపోతుంది.
(ఉదాహరణ: ఎం. వెంకయ్యనాయుడు గారు ఉపాధ్యక్షులుగా ఎన్నికైనప్పుడు వారి రాజ్యసభ సభ్యత్వం, ప్రణబ్ ముఖర్జీ గారు రాష్ట్రపతిగా ఎన్నికైనప్పుడు వారి లోక్సభ సభ్యత్వం ఆటోమెటిక్ గా ఖాళీ అయ్యాయి).
ద్వంద్వ రాజ్యాంగ నియమావళిలోని నిరోధక నిబంధనలు కేవలం సాంకేతికతలు కావు, అవి ప్రజాస్వామ్య నైతికతకు (ఎమోక్రటిక్ నైతికత) ప్రతీకలు.
ఒక వ్యక్తి ఒకే సమయంలో రెండు బాధ్యతాయుతమైన పదవులలో ఉంటే, నియోజకవర్గ ప్రజలకు పూర్తి న్యాయం చేయలేరనే ఉద్దేశ్యంతోనే ఈ చట్టాలు అమలు చేయబడ్డాయి.
అయితే, సమకాలీన రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపుల చట్టం విషయంలో స్పీకర్ల పక్షపాత వైఖరిపై విమర్శలు వస్తున్నాయి. సుప్రీంకోర్టు సూచించినట్లుగా (కీషమ్ మేఘచంద్ర సింగ్ కేసు, 2020), అనర్హత వేటు వేసే అధికారాలను స్పీకర్ కాకుండా ఒక స్వతంత్ర ట్రిబ్యునల్కు అప్పగించడం ద్వారా ఈ నిబంధనలను మరింత స్పష్టంగా అమలు చేయవచ్చు. అప్పుడే శాసనవ్యవస్థ యొక్క పౌర విశ్వసనీయత మరింత బలపడుతుంది.

0 Comments