భారత రాజ్యాంగం మనకు ప్రసాదించిన ప్రాథమిక హక్కులలో అత్యంత కీలకమైనది 'స్వేచ్ఛా స్వాతంత్ర్యపు హక్కు'.
అయితే, రాజ్యాంగం అమల్లోకి వచ్చిన ఏడాది కాలంలోనే (1951లో) ఈ ఆర్టికల్కు మొదటి రాజ్యాంగ సవరణ చేయాల్సి వచ్చింది. అయితే మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 19 కు చేసిన సవరణలు అనేవి స్వేచ్ఛకు సంకెళ్లా? సమాజ రక్షణకు అవసరమా? అనేది ఈ సవరణ వెనుక ఉన్న చారిత్రక నేపథ్యం, మేధావుల మధ్య జరిగిన చర్చలు, కోర్టు కేసుల వివరాలు మరియు ఆర్టికల్ 19 లోని ఉప-అధికరణల (ఉప-నిబంధనలు) గురించిన పూర్తి విశ్లేషణ ఈ ఆర్టికల్లో చూద్దాం.
1. ఆర్టికల్ 19(1) స్వేచ్చా స్వాతంత్రపు హక్కు :
ఇది 6 హక్కుల కలయికగా చెప్పవచ్చు. (ప్రారంభంలో 7 ఉండేవి, అయితే 1978లో ఆర్టికల్ 19(1)(f) ఆస్తి హక్కు 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తొలగించబడింది). మిగిలిన వాటిని చుస్తే..
అవి:19(1)(a): వాక్ స్వాతంత్ర్యం మరియు భావప్రకటన స్వేచ్ఛ (వాక్ స్వాతంత్ర్యం మరియు వ్యక్తీకరణ). ఇది అత్యంత వికసింపబడిన నిబంధన.
గమనిక : నోటా అనే నిబంధన ఈ ఆర్టికల్ మూలంగానే వచ్చింది.
19(1)(బి): ఆయుధాలు లేకుండా శాంతియుతంగా సమావేశమయ్యే హక్కు (Preedom to assemble peaceably and without arms). కానీ సిక్కు మతస్థులు “కృపాణం” ధరించి శాంతియుతంగా సమావేశం కావచ్చు.
ఈ అధికరణం ముఖ్యంగా చెప్పేదేమిటంటే శాంతియుతంగా ప్రదర్శనలు, ఊరేగింపులు చేసుకోవచ్చు. ఇక్కడ భావ వ్యక్తీకరణ అనేది ఉంటుంది కానీ అది పరిమితులకు లోబడి ఉంటుంది అంటే ఒక చెప్పాలంటే అధికరణం 19(1)(a) ను ఇది కంట్రోల్ చేస్తుంది అన్నమాట.
19(1)(c): సంఘాలు లేదా సంస్థలు/సహకార సంఘాలను ఏర్పాటు చేసుకునే హక్కు (సంఘాలు లేదా సంఘాలను ఏర్పరచుకునే స్వేచ్ఛ). రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు, వాణిజ్య, వ్యాపార, వృత్తి సంఘాలను ఏర్పరచుకొని నమోదు చేసుకోవచ్చు.
గమనిక: కానీ సైనికులు ఉద్యోగ సంఘాలు ఏర్పరచుకుంటే దేశ సమగ్రతకు, సార్వబౌమాత్వానికి భంగం కలిగే అవకాశాలు కనుక వారికి ఈ హక్కు వర్తించదు.
19(1)(డి): భారతదేశమంతటా స్వేచ్ఛగా సంచరించే హక్కు (భారతదేశ భూభాగం అంతటా స్వేచ్ఛగా కదలడానికి స్వేచ్ఛ). దీనివల్ల ప్రజల్లో సంకుచిత భావం తొలగి, ఏకత్వ భావన పెంపొందుతుంది, అయితే ఈ హక్కును సామాన్య ప్రజల సంక్షేమం అలానే sc, st తెగల ప్రయోజనాలు అనే పరిమితులను దృష్టిలో పెట్టుకొని వినియోగించుకోవాల్సి వస్తుంది.
19(1)(ఇ): దేశంలో ఏ ప్రాంతంలోనైనా నివసించే లేదా స్థిరపడే హక్కు (భారతదేశంలోని ఏ ప్రాంతంలోనైనా నివసించడానికి మరియు స్థిరపడటానికి స్వేచ్ఛ).
19(1)(g): నచ్చిన వృత్తి, వ్యాపారం లేదా ఉపాధిని చేపట్టే హక్కు (ఏదైనా వృత్తి, వ్యాపారం లేదా వ్యాపారం చేసే స్వేచ్ఛ). ఇందులో ప్రజా సంక్షేమం దృష్ట్యా ప్రభుత్వం హేయమైన ఆంక్షలను విధించింది.
2. వాక్ స్వాతంత్ర్యం vs ఆర్టికల్ 19(2) నియంత్రణలు:
అయితే మొదటి రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చబడిన అధికరణలు ఆర్టికల్ 19(2) ప్రకారం భారత పౌరులపై చెడు ప్రభావం చూపకూడదు.
అంటే ఆర్టికల్ 19(1)(a) ప్రకారం పౌరులకు మాట్లాడే, రాసే స్వేచ్ఛ ఉంటుంది.. దానికి అపరిమితమైన హక్కులు లేవు. సమాజ శ్రేయస్సు కోసం ఆ స్వేచ్ఛను నియంత్రించే, అడ్డుకట్ట వేసే ఆర్టికల్ 19(2) అన్నమాట .
1951లో దేశంలో అప్పుడప్పుడే తలెత్తుతున్న అంతర్గత అల్లర్లు, మతకల్లోలాలు, కమ్యూనిస్ట్ సాయుధ పోరాటాలను అదుపు చేసేందుకు నెహ్రూ ప్రభుత్వం మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 19(2)లో మూడు కీలకమైన కొత్త పరిమితులను చేర్చింది.
ప్రస్తుత ఆర్టికల్ 19(2) ప్రకారం కింది అంశాల ఆధారంగా ప్రభుత్వం వాక్ స్వాతంత్ర్యంపై "సహేతుకమైన పరిమితులు" (సహేతుకమైన పరిమితులు) విధించవచ్చు:
అయితే ఈ వాక్ స్వాతంత్రం అనేది.....
భారత సార్వభౌమాధికారం మరియు సమగ్రత (రాష్ట్ర భద్రత) కు ఎలాంటి భంగం వాటిల్లకూడదు,
విదేశాలతో స్నేహసంబంధాలు లో ఎలాంటి ముప్పు రాకూడదు ,
ప్రజా శాంతి / శాంతిభద్రతలు (పబ్లిక్ ఆర్డర్) లో ఎలాంటి భంగం ఏర్పడకూడదు,
ప్రజలు సభ్యత లేదా నైతికత (మర్యాద లేదా నైతికత) తో మెలగాలి,
కోర్టు ధిక్కరణ (కోర్టు ధిక్కారం) వ్యాఖ్యలు చేయకూడదు,
పరువు నష్టం (పరువు నష్టం) ఎవరిని అవమానించే విధంగా ఉండకూడదు,
నేర ప్రేరణ (ఒక నేరానికి ప్రేరేపించడం) ఒక వ్యక్తిని నేరం చేయడం ప్రోత్సహించకూడదు, ప్రజలకు ఇబ్బంది కలిగించకూడదు .
3. చారిత్రక కోర్టు కేసులు మరియు మేధావుల చర్చలు:
మొదటి రాజ్యాంగ సవరణకు దారితీసిన ప్రధాన కారణం 1950లో సుప్రీంకోర్టు ఇచ్చిన రెండు సంచలన తీర్పులు:
రమేష్ థాపర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ (1950):
'క్రాస్ రోడ్స్' అనే లెఫ్ట్-వింగ్ పత్రికపై మద్రాస్ ప్రభుత్వం విధించిన నిషేధాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. కేవలం "ప్రజా శాంతి" కి భంగం వాటిల్లుతుందనే కారణంతో వాక్ స్వాతంత్ర్యం నొక్కేయలేమని, "రాజ్యాన్ని కూలదోసే" (రాష్ట్రాన్ని కూలదోసే) అంతటి తీవ్రమైన ముప్పు ఉంటేనే నిషేధం చెల్లుతుందని కోర్టు స్పష్టం చేసింది.
బ్రిజ్ భూషణ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఢిల్లీ (1950):
ఆర్ఎస్ఎస్ వారపత్రిక 'అర్గనైజర్' పై ప్రభుత్వం తెచ్చిన ముందస్తు సెన్సార్షిప్ను కూడా సుప్రీంకోర్టు తప్పుబట్టింది.
పార్లమెంట్లో రేగిన వివాదం – మేధావుల అభ్యంతరాలు:
ఈ తీర్పు వల్ల ప్రభుత్వానికి శాంతిభద్రతలు కాపాడటం కష్టంగా మారింది. దీంతో నెహ్రూ ప్రభుత్వం మొదటి సవరణ బిల్లు తెచ్చింది. అప్పుడు పార్లమెంట్లో తీవ్ర చర్చ నడిచింది:
"నేర ప్రేరణ" పై అభ్యంతరం:
బిల్లులో చేర్చిన "నేర ప్రేరణ" (ఒక నేరానికి ప్రేరేపించడం) అనే పదం చాలా అభ్యంతరకరంగా లేదు, ఇది మిస్ యూస్ అవుతుందని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వంటి నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఒక వ్యక్తి ప్రభుత్వంపై చేసే చిన్నపాటి విమర్శను లేదా నిరసనను కూడా పోలీసులు "నేర ప్రేరణ" కింద మార్చి జైల్లో పెడతారని, ఇది పౌరుల నోరు నొక్కేయడమేనని మేధావులు వాదించారు.
"రాజ్యాన్ని కూలదోయడం" అనే పదం ఎందుకు పెట్టలేదు?: విమర్శకులు "నేర ప్రేరణ" అనే విస్తృత పదానికి బదులు, సుప్రీంకోర్టు చెప్పినట్లు "రాజ్యాన్ని కూలదోసేటువంటి మాటలు" (ఓవర్త్రో ది స్టేట్) అనే నిర్దిష్ట పదాన్ని పరిమితిగా పెడితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. కానీ, కేవలం దేశాన్ని కూలదోసేంత పెద్ద నేరం కాకుండా.. సమాజంలో జరిగే చిన్న చిన్న హింసలు, హత్యలు, మతకల్లోలాలను ప్రేరేపించే ప్రసంగాలను కూడా అడ్డుకోవడానికి "నేర ప్రేరణ" అనే పదమే సరైనదని నెహ్రూ ప్రభుత్వం సమర్థించింది.
4. మిగిలిన స్వేచ్చా హక్కులు – వాటి పరిమితులు:
ఆర్టికల్ 19(3): ఇది ఆర్టికల్ 19(1)(బి) పై పరిమితిని విధిస్తుంది. శాంతియుతంగా సమావేశమయ్యే హక్కుపై దేశ సార్వభౌమాధికారం, ప్రజా శాంతి (పబ్లిక్ ఆర్డర్) ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఆంక్షలు విధించవచ్చు (ఉదాహరణకు: సెక్షన్ 144 విధించడం).
ఆర్టికల్ 19(4) ఇది ఆర్టికల్ 19(1)(సి) పై పరిమితిని విధిస్తుంది. సంఘాలు, సంస్థలు ఏర్పాటు చేసే హక్కుపై దేశ సార్వభౌమత్వం, ప్రజా శాంతి, నైతికత ఆధారంగా పరిమితులు ఉంటాయి (ఉదాహరణకు: ఉగ్రవాద సంస్థలపై నిషేధం).
ఆర్టికల్ 19(5) ఇది ఆర్టికల్ 19(1)(d) మరియు 19(1)(e) పై పరిమితులు విధిస్తుంది. తెగరించే మరియు స్థిరపడే హక్కులపై సాధారణ ప్రజల కోసం లేదా దేశంలో షెడ్యూల్డ్ (తెగలు) సంస్కృతి, ప్రయోజనాల కోసం ప్రభుత్వం ఆశలు పెట్టవచ్చు (ఉదాహరణకు: గిరిజన ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాల్లో ఇన్ లైన్ పర్మిట్).
ఆర్టికల్ 19(6) ఇది ఆర్టికల్ 19(1)(g) పై పరిమితిని విధిస్తుంది నచ్చిన వృత్తి/వ్యాపారం చేసుకునే స్వేచ్ఛ ఉన్నా.. దానికి కావలసిన కనీస వృత్తిపరమైన లేదా సాంకేతిక అర్హతలను ప్రభుత్వం నిర్ణయించవచ్చు. అలాగే కొన్ని వ్యాపారాలను ప్రభుత్వం పూర్తిగా తన ఆధీనంలోకి (మోనోపోలీ) తీసుకోవచ్చు (ఉదాహరణకు: రైల్వేలు, అణుశక్తి).
5. ప్రస్తుత డిజిటల్ యుగంలో స్వేచ్ఛ - శాంతిభద్రతల సవాలు:
రాజ్యాంగం రాసిన రోజుల్లో కేవలం ప్రసంగాలు, పత్రికలు మాత్రమే సమాచార సాధనాలు. కానీ నేటి డిజిటల్ యుగంలో సోషల్ మీడియా పోస్టులు, మీమ్స్ (Memes) కూడా ఆర్టికల్ 19(1)(a) కల్పించిన భావప్రకటన స్వేచ్ఛ కిందికే వస్తాయి.
అయితే, ఇంటర్నెట్ యుగంలో ఒక చిన్న పోస్ట్ లేదా తప్పుడు సమాచారం (తప్పుడు సమాచారం) క్షణాల్లో దేశవ్యాప్తంగా అల్లర్లకు దారితీసే ప్రమాదం ఉంది. అందుకే నేటి కాలంలో ఆర్టికల్ 19(2) లోని 'ప్రజా శాంతి' లేదా 'రాజ్య భద్రత' అనే నిబంధనలు మరింత పెరిగాయి.
ఇటీవలి కాలంలో ఏర్పడిన " కాక్రోచ్ జనతా పార్టీ " (CJP) సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ ఖచ్చితమైన నిరూపణ, హక్కులకు మరియు పరిమితులకు మధ్య ఉన్న సవాలు స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఆర్టికల్ 19(1)(a) పరిధిలోకి వస్తుంది.
అయితే ప్రజాస్వామ్యంలో నిరుద్యోగం, పరీక్షల నిర్వహణ వంటి ప్రజా సమస్యలపై ప్రభుత్వం అసంతృప్తిని వ్యంగ్యంగా (వ్యంగ్యంగా) మీమ్స్ ద్వారా వ్యక్తపరచడం పౌరుల హక్కుగా నిర్ధారించబడింది.
మరొక వైపు రాజ్య/శాంతి భద్రత అంశానికి సంబంధించినది అనగా ఇది ఆర్టికల్ 19(2) కు సంబంధించిన అంశం, అనగా సోషల్ మీడియా వేదికల వ్యవస్థలపై నమ్మకం పోయేలా చేయడం, తీవ్రమైన ఆరోపణలతో లీ డిజిటల్ కేజీలు లేదా అశాంతిని ప్రేరేపించేలా ప్రచారాలు జరగడం వల్ల శాంతిభద్రతలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని కోరుతున్నారు.
ఈ బ్లాక్ చట్టంలోని నిబంధనల ప్రకారం అకౌంట్లను చేయడం వంటి చర్యలను చట్టాన్ని కాపాడటానికి తీసుకునే రక్షణ చర్యలను ప్రభుత్వం సమర్థిస్తుంది.
ఇంటర్నెట్ షట్ డౌన్లు మరియు ప్రజా రక్షణ:
ఏదైనా ప్రాంతంలో ఉద్రిక్తతలు లేదా మతకల్లోలాలు తలెత్తినప్పుడు దేశంలో ప్రభుత్వం ఇంటర్నెట్ సౌకర్యాన్ని తాత్కాలికంగా నిలిపివేయడం మనం చూస్తూనే ఉంటాం. ఇది పౌరుల భావప్రకటన స్వేచ్ఛను తాత్కాలికంగా అడ్డుకున్నప్పటికీ, సమాజంలో హింస మరింత పెరగకుండా, అమాయక ప్రజల ప్రాణాలు కాపాడటానికి ఆర్టికల్ 19(2) కల్పించిన అధికార ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకుంటుంది.
1951లో మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 19(2)లో "నేర ప్రేరణ", "ప్రజా శాంతి" వంటి పరిమితులు నేటికీ నిరంతరం చర్చకు దారితీస్తూనే ఉన్నాయి.
ఒకవైపు పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛను కాపాడటం ఎంత ముఖ్యమో, మరో కోట్లాది మంది ప్రజల భద్రత, దేశ సార్వభౌమత్వాన్ని కాపాడటం కూడా అంతే ముఖ్యం.
చట్టాన్ని అమలు చేసే సంస్థలు వీటిని దుర్వినియోగం చేయకుండా చూసేందుకు మన దేశంలో న్యాయవ్యవస్థ (న్యాయవ్యవస్థ) ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటుంది. ప్రభుత్వ చర్యలు రాజ్యాంగబద్ధంగా ఉన్నాయో లేదో సుప్రీంకోర్టు సమీక్షిస్తూనే ఉంటుంది. "అపరిమితమైన స్వేచ్ఛ అరాచకత్వానికి ఉనికి.. అలాగని అతిగా నియంత్రించడం ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీస్తుంది". కాబట్టి హక్కులకు, బాధ్యతలకు మధ్య మార్పు ఉన్నప్పుడే బలమైన ప్రజాస్వామ్యం సాధ్యమవుతుంది.
భావ ప్రకటన స్వేచ్ఛ గురించి అదనపు సమాచారం కొరకు కింది లింక్ లను చూడండి 👇👇👇
2) భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో విద్వేషపూరిత ప్రసంగం: రాజ్యాంగం దీనిని అనుమతిస్తుందా? /murthyadvise.blogspot.com
3) Cockroach Janata Party: ఒక్క రాత్రిలో 90 లక్షల ఫాలోవర్స్! ఏంటి ఈ CJP కథ?/murthyadvise.blogspot.com

0 Comments